Saturday 6 October 2012

ఆరోపణలపై ఆరోపణలు చేయరట

అధికారం కావాలి.కానీ అధికార పక్షాన్ని ఏమీ అనరట. ఎంత సిత్రం చూడండి. కేజ్రీవాలా అన్న ఓ వ్యక్తి వాద్రాపై ఆరోపణలు చేస్తే.. వాటిలో నిజమెంతో అబద్దమెంతో తేల్చాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండు చేయడం మానేసి..  కేజ్రీవాలావి  ఆరోపణలే... అందుకే వాటిపై బీజేపీ పెద్దగా స్పందించ లేదని గడ్కరీ  ఐబీఎన్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ కు మిత్రులకు కొరతలేదన్నవిషయం అర్థమవుతుంది.



ఇప్పటికే  మహారాష్ట్ర ఇరిగేషను స్కీము స్కాములో గడ్కరీ పేరు మునుగుతూ తేలతా ఉంది.  కాంగ్రెసోళ్లు కూడా  గడ్కరీపై  గట్టిగా దాడి చేయడం లేదు. అందుకు ప్రతిఫలంగానే  గడ్కరీ సాబ్.. వాద్రా ఘటనపై మౌనంవ్రతం పాటిస్తున్నారన్న గుసగుసలూ ఉన్నాయి. నిజం పెరుమాళ్లకెరుక


No comments:

Post a Comment