Wednesday 26 December 2012

అమ్మా... ప్రతిభమ్మా మమ్మల్ని మాఫ్ చేయ్


ఎన్నన్నాం నిన్ను 
ఎంతలా ఆడిపోసుకున్నాం
ఇంతకుముందు ఎవరూ చేయనట్టు
ఇక ముందు ఎవరూ చేయరన్నట్లు 
తప్పైపోయింది తల్లీ .. ఇవిగో లెంపలు


President Pranab Mukherjee used just for an hour



Rs 37 lakh spent on room President Pranab Mukherjee used just for an hour
The government renovated the Circuit House ahead of President Pranab Mukherjee's visit.
BELGAUM: Rs 198 lakh of the taxpayers' money was spent when President Pranab Mukherjee was in Belgaum to inaugurate the Suvarna Vidhana Soudha in October.

The government renovated the circuit house (CH) ahead of President Pranab Mukherjee's visit. It spent over Rs 161 lakh on renovation and around Rs 37 lakh on furnishing the room, where Mukherjee spent just an hour on October 11.

RTI activist Bhimappa Gadad from Mudalagi in Gokak taluk sought information from the public works department on the expenditure incurred during the President's visit.

There are two Circuit House buildings in the same compound near the central bus stand. One was inaugurated two years ago. The old building and the compound was renovated during the World Kannada Meet (WKM) held in the city last year.

This before the government spent Rs 32 lakh in 2010-11 and Rs 18 lakh in 2011-12 for renovating the circuit house.

Tuesday 25 December 2012

అమ్మతో అన్న మాటే అన్నానే, బూతెలా అయిందబ్బా

ఠీక్ హై.. ఎంత సుందరమైన పదం
అదేదో సినిమాలో అంటాడు నానా పటేకర్.
ఏక్ మఛ్ఛర్  ఆద్మీ కో హిజడా బనాదేతాహై అని
అలా ఒక్క ఠీక్ హై..
ఎంత కష్టం తెచ్చింది మన ప్రధానికి



మన్మోహన్జీ, చిల్లర బిల్లు లాయియే
ఠీక్ హై మేడం
ప్రధానీజీ, అణు బిల్లు చాహియే
ఠీక్ హై మేడం
సింగ్జీ  ఘర్ కో  ఏక్బార్ ఆయియే
ఠీక్ హై మేడం


ఆ ఫ్లోలోనే ..    మూఢభక్తిలోనే
ఇక్కడా ఠీక్ హై అన్నాడు
అదే  తప్పైపోయింది జనానికి
ఎంత మాట ఎంత మాటంటున్నారు.
ఇన్నాళ్లూ అదే పదాన్ని ఎన్నిసార్లన్నా 
ఏమీ అనని జనం ఇప్పడు కళ్లెర్రచేస్తున్నారు.


అలవాట్లో పొరపాటని,
ఆటలో అరటిపండని,
కూరలో కరేపాకని ,
వదిలేడంలేదు.
అందలాన్ని అందించిన పదంపై
అమ్మకు సంతోషాన్నిచ్చిన పదంపై
నిప్పులు చెరగుతున్నారు

ఏం చేస్తాం, ఠీక్ హై .




ఓడితే ఓడారు గాన్రా



ఆడేవడో భువనేశ్వరట
ఏమేశాడు, ఏమేశాడు
కుమ్మేశాడు
3 ఓవర్లు 9 పరుగులు
ఇన్స్వింగ్  అవుట్స్వింగు
ఇరగదీశాడు
వీడూ యూపీ కుర్రానేనట
అందుకే తాగుబోతు ప్రవీణ్ లానే
స్వింగ్ తో చిందేశాడు
 


 



Monday 24 December 2012

బావా.. అదిగో మోడీ పురి, అదిగో అధికారం

బావా.. అదిగో మోడి పురి. 
అదిగో  2014లో మన అధికారానికి సాయపడే కాషాయదళం
అదిగో  సదా మన సేవలోనే  తరించే వెంకయ్య నాయుడు
అదిగో మన మేలు కోరే పెద్దాయన అద్వాని
అదిగో మనకు ఓట్లు తెచ్చే లడ్డూ నరేంద్రభాయ్ 
అదిగో 99లో మన వెంట నడిచిన నాయకగణం

వెళ్లమందువా బావా,  మోడీ పురి వెళ్లమందువా
వెళ్లి  నాటి చెలిమిని మళ్లీ ఓ సారి గు్తు చేయమందువా
చేసుకున్న బాసలు చెరిగిపోవనీ,
అధికారంపై శలు మెండుగా ఉన్నవనీ,
2014లోని మనతోనే నడవమనీ
కాషాయం, పసుపు ఒకటేననీ,.
ఎన్నటికీ విడిపోని జంట మనదేననీ
లౌకికవాదం ఓ ముసుగేననీ.
అధికారమే పరమావధి అనీ

నీ మాటగా వారికి చెప్పి,
రమ్మందువా బావా. 
 






షిండే వాకిట్లో తెలంగాణ చెట్టు



తోడు దొంగలు సినిమా చూశారా
ఇద్దరు దొంగలుంటారు.
కలిసే దొంగతనాలు చేస్తా ఉంటారు
దోచుకున్నదీ కలిసే  పంచుకుంటా ఉంటారు.
ఏంటీ చూడలేదా. చూశారుగానీ. 
అలా ఉండదంటారా
్చ్...  సినిమా పేరలా ఉంది కాబట్టి
కథా అలానే ఉంటుందనుకున్నా
అడ్డం తిరిగినట్టుంది.


పోనీ అఖిలపక్షం నాటకం ఎప్పడైనా చూశారా
ఢిల్లీలో ఆడతా ఉంటాది. హోం మంత్రి ఆడిస్తా ఉంటాడు
ఒక్కో పార్టీ తరఫున ఇద్దరు వెళతా  ఉంటారు.
వెళ్లిన ఇద్దరూ  వేర్వేరు మాటలు చెబుతా ఉంటారు. అయినా
పక్కపక్కనే కూర్చోని కుళ్లు జోకులేసుకుంటా ఉంటారు.
నాటకం ఆడించేవాళ్లు  కూడా ఆ జోకులకు 
విరగబడి నవ్వుతూ.. తెర దించేస్తా ఉంటారు.

చూడ్లేదా... 28న మళ్లీ మీ కోసం వేస్తున్నారు. 


నాటకం పేరు; షిండే వాకిట్లో తెలంగాణ చెట్టు
చిరునామా, నార్తు బ్లాకు.  న్యూఢిల్లీ


 




ఓ క్లాస్ పీకాను, నచ్చితే పాస్ ఇట్ ఆన్

ఉన్నమాటంటే అందరికీ ఉలుకేనండీ
ఇప్పడు సత్తిబాబు ఏమన్నాడనీ
అంతగా  గగ్గోలు పెట్టేత్తున్నారు.
అర్ధరాత్రి సొతంత్రం వచ్చిందని 
ఒంటరిగా తిరుగుతామా అని అన్నాడు.
అంతే కదా, దీనికే  పొలోమని మీద పడిపోవాలా
తెలాకా ఆడుగుతాను ఆయనన్న దాంట్లో తప్పేముందండే
భద్రం బీకేర్ ఫుల్ అని ఓ జాగ్రత్త చెప్పాడు.
ఎందుకు చెప్పాడు, మద్యం దుకాణాల యజమానిగా 
తనకు అనుభవముంది కాబట్టి చెప్పాడు.

సత్తెబాబు మందు దుకాణంలో
ఫుల్ బాటిల్ కొట్టిన ఏ వెధవైనా 
అర్ధరాత్రి  అమ్మాయి కనబడితే ఊరుకుంటాడండీ.
కోడు. కాబట్టి  కేర్ఫుల్లూ  అని అన్నాడు.  అర్ధం చేసుకోరూ


అయినా  బొత్సలాంటి రాజకీయనాయకులు 
రాజకీయం నడుపుతున్నంతసేపూ ,
నాయకులుగా ఎన్నికవుతున్నంతసేపూ
ఇలాంటి వ్యాఖ్యలూ వస్తూనే ఉంటాయి
వివక్షలు సాగుతూనే ఉంటాయి.
ఎందుకంటే ఆళ్లు బతికేదే ఈ పునాదులపై
అవే లేకపోతే వాళ్ల రాజకీయ పునాదులే ఉండవు.
అందుకే  సత్తెకాలపు ఆలోచనలతోనే
ఈ సమాజం ఎప్పటికీ ఉండాలనీ, 
మార్పు రాకూడదని,  వచ్చినా 
దాన్ని వీలైనంత సమయం వాయిదా వేయించాలని
ప్రయత్నిస్తూ ఉంటారు. 
ఆ ప్రయత్నంలో ఇలాంటి వాగుడు
వాగతా ఉంటారు
సో వ్యవస్థ మారాలంటే ముందు సత్తెబాబులు పోవాలి. 
అది జరిగితే అటోమేటిగ్గా చానా జరిగిపోతాయి. ఏమంటారు.




 

Friday 21 December 2012

మోడీ విజయం వెనుక..

కొన్ని నిజాలను ఒప్పుకోవటానికి మనసు అంత తొందరగా అంగీకరించదు. 
అందుకే కరిష్మా, కాకరకాయ, అభివ్రుద్ధి లాంటి తీయని పదాలతో
ఆ చేదు నిజాలకు చక్కెర పూస్తుంటాం.
మోడీ  విషయంలోనూ ఇప్పడదే జరుగుతోంది. 
మూడోసారి ఎందుకు గెలిచాడంటే అభివ్రుద్ధి అంటున్నాం.
కానీ వాస్తవం అదేనా.


2002  అల్లర్లతో  మైనారిటీ వర్గాల్లో  భయం ఏర్పడింది. 
ఆ భయం మెజారిటీ వర్గాలకు నచ్చింది.
ఆ మెజారిటీయే తదనంతర ఎన్నికల్లో 
నరేంద్రుడిని ఆదరించింది. పగ్గాలందించింది
ఐతే మోడి తెలివైనోడు.
2002తో తనను మెజారిటీ ఆదరించినా, 
మళ్లీ మళ్లీ నెగ్గడానికి  అది మాత్రమే సరిపోదని తెలుసుకున్నాడు. 
ఎందుకంటే ఆదరించిన మెజారిటీ వర్గాలకూ 
ఆశలుంటాయి. ఆకాంక్షలుంటాయి.
కుటుంబాలుంటాయి. కోరికలుంటాయి. 
కాబట్టి  2002ను చూసి ప్రతిసారీ వారు ఓటేయలేరు.
అందుకే  డెవలెప్మెంట్ కార్డు తీశాడు
ఇక్కడో విషయాన్ని గమనించాలి
గుజరాత్ ముందునుంచీ పారిశ్రామికంగా 
అభివ్రుద్ధి చెందిన రాష్ట్రం.
ఒరిస్సా లాంటి రాష్ట్రాన్ని దేశంలో నెం.1గా తీర్చిదిద్దితే 
దాన్ని గొప్ప ఘనత అనొచ్చేమో గానీ..
అభివ్రుద్ధి పథంలో ఉన్న గుజరాత్ ముందుకు తీసుకెళ్లడం  
అంత గొప్ప ఘనత కింద లెక్కేయలేం.
కానీ మోడి దాన్ని కూడా  గొప్ప ఘనతగానే ప్రచారం చేశాడు.
మరీ విషయం గుజరాత్ ప్రజలకు తెలీదా అంటే  తెలుసు. 
అయితే 2002  కూడా వారి మనసుల్లో బలంగా ఉంది. 
అందుకే రాష్ట్రమంతా ఒకే రకంగా అభివ్రుద్ధిచెందకపోయినా,
అసమానతలున్నా..  నరేంద్రుడిని మారుద్దామనుకోలేదు.
పెద్ద తప్పులు చేయకుండా, అప్పడప్పుడు 2002ను కెలుకుతూ
ముందుకు సాగితే  2016లోనూ  మోడీని గుజరాత్ ప్రజలు మార్చకపోవచ్చు.
మోడీ స్థానంలో ఇంకొకరుంటే ఇదే విషయాన్ని గట్టిగా చెప్పలేమనుకోండి.

 
అందుకే మోడీ వ్యక్తిత్వాన్నీ ఇక్కడ ద్రుష్టిలో పెట్టుకోవాలి
అతను సాదాసీదా రాజకీయ నాయకుడుకాదు. 
ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో నుంచి ఎదిగిన నాయకుడు. 
సంఘ్ పై  ఉండే వాళ్లకు చరిత్ర పట్ల ఒక అవగాహన ఉంది. 
అది మంచిదా చెడుదా అని చెప్పను గానీ,
అదే అవగాహన మోడీకీ ఉంది.
ఆ అవగాహన ఆధారంగా అతను పనితీరుంటుంది.
పైకి  జనతా జనార్ధన్, ఛే కరోర్ గుజరాతీ లాంటి కబుర్లు చెప్పినా,
నరేంద్ర భాయ్ అంతిమ లక్ష్యం సంఘ్ ఏజెండానే.

దాన్ని గుజరాత్లోని మెజార్టీ ప్రజలు సమర్థిస్తున్నారు. 
మరి దేశంలోని మెజార్టీ ప్రజలూ సమర్థిస్తారా లేదా అన్నది
కాలమే నిర్ణయించాలి.




Tuesday 18 December 2012

ఎటూ వెళ్లనీలేదు ఇళయరాజా


ఇళయరాజా సంగీతం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.

ఐతే ప్రపంచంలో పతీవోడికీ ఓ ఓపినియన్ ఉంటుంది.

దీన్ని  ఎవరూ కాదనలేదు. మరి నా ఒపినియేటంటే..



ఎటో వెళ్లి పోయింది మనసు సినిమాకు ఇళయరాజా
బదులు రెహమాన్ సంగీతం చేసుంటే బాగుండేది.

బ్యాగ్రౌండ్ స్కోరు కూడా  బాలేదు. దీంతో చాలా సీన్లు తేలిపోయాయి.

అసలీ సినిమాకి ఇళయరాజాను తీసుకోవడమే గౌతమ్ మీనన్ చేసిన తప్పు.

Monday 17 December 2012

నామం పెట్టు నామం పెట్టు దేశానికి

ఏరా స్కూలుకు  ఎందుకు రాలేదు
కడుపులో నొప్పి మేడం.

ఏం దేవేందర్.  చిల్లరచర్చలో 
ఓటేందుకెయ్యలేదు

ఒంట్లో నలతగా ఉంటేనూ..
అయినా బాబు గారికి లీవు లెటరిచ్చానే, మీకివ్వలేదా.


సుధా నీ సంగతి
మా ఇంట్లో వాళ్లకు వంట్లో బాలేదు. అందరికీ జొరం. నిజ్జెం

చౌదరి నీకేం పోయే కాలం.
 వేళకి పోయే విమానం దొరకలేదు. అమ్మతోడు... దొరికుంటేనే..
 

 

నమ్మాలి, కట్టుకథలు నమ్మాలి, 
దేశానికి నిలువు నామాలు పెట్టే వాళ్లనీ,
చిల్లరపనులు చేసి పెద్దలుగా చెలామణీ అయ్యేవాళ్లనీ, 
ప్రజాస్వామ్యాన్ని టోకున బేరం పెట్టేవాళ్లనీ
నమ్మాలి. అయినా నమ్మితే పోయేదేముంది. 

గిరీశాన్ని జైల్లో పెట్టాలి.. ఇట్లు గుమ్మడికాయ దొంగలు

నిజం చెబితే నిష్టూరమాడతారు.  కట్జూపైనా అలానే నిష్టూరమాడారు  చాలామంది. అయినా  వెధవ, సన్నాసంటే  ఎవరికైనా మంట పుట్టడం సహజం. అందుకే  మంట పుట్టినోళ్లంతా ఎంత మాట, ఎంత మాటంటూ  కారాలూ మిరియాలూ,  ఆవాలూ జీలకర్ర , ఇలా ఏది దొరికితే అది నూరేశారు కట్టూపైన. అంతగా మంట పుట్టనివాళ్లు మాత్రం, కట్టూ చెప్పిన  శాతానికి  వెంట్రుకలు పీకారు. ఉంటే గింటే  60, 70 శాతముంటారేమో కానీ.. మరీ 90 శాతముండరనీ.  కావాలంటే 2001 జనాభా లెక్కలు ఓసారి తిరిగేయాలని కట్టూ గారికి సూచించారు. గుమ్మడికాయ దొంగలు మాత్రం ఊరుకోలేదు. తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ పక్క భుజాలు తడుముకుంటూనే మరోవైపు  కట్జూని  కఠినంగా శిక్షించాల్సిందేనంటూ కోర్టు తలుపులు దబదబా బాదేరు.  నిజమే గుమ్మడికాయల దొంగలు చెబుతున్నట్లు కట్టూని శిక్షించాల్సిందే.  ఐతే అంతకుముందు ఇంకో వ్యక్తినీ  శిక్షించాలి. ఆ వ్యక్తి పేరు గిరీశం. అవును కన్యాశుల్కంలోని గిరీశమే. ఎందుకంటే కట్టూ గారు తిట్టింది తాజాగానే.  కానీ వంద సంవత్సరాల క్రితమే  ‘మన వాళ్లు వఠ్ఠి వెథవాయిలోయ్’ అని కన్యాశుల్కంలో  గిరీశం తేల్చేశాడు. పైగా  కట్టూలా పదిశాతం డిస్కౌంటూ ఇవ్వలేదు. సో గిరీశం గారూ.. ఎక్కడున్నా వెంటనే లగెత్తుకొని రండి. మధురవాణి దగ్గరున్నాను, ఛార్జీలకు కాపర్స్ తక్కువయ్యాయి.. అంటే కుదరదు. మీ శిష్యుడు వెంకటేశం దగ్గర అప్పు తీసుకునైనా  రావాలి. ఇది గుమ్మడికాయ దొంగల డిమాండు.